ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్క్విడ్ గేమ్’ ఛాలెంజ్‌లో పాల్గొంటే ఎలా ఉంటుందనే ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 17, 2025, 06:51 PM

నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలైన ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రాణాలను పణంగా పెట్టి ఆడే ఈ సర్వైవల్ గేమ్ సిరీస్ రికార్డు వ్యూస్ సాధించి, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘స్క్విడ్ గేమ్’ సీజన్ 3 ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో, టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ ‘స్క్విడ్ గేమ్’ ఛాలెంజ్‌లో పాల్గొంటే ఎలా ఉంటుందనే ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో కూడిన ఒక ఏఐ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ ఏఐ వీడియోలో బాలకృష్ణతో పాటు నటి అనసూయ భరద్వాజ్, నటుడు రాజీవ్ కనకాల కూడా ‘స్క్విడ్ గేమ్’ ఆటల్లో పాల్గొన్నట్లు చూపించారు. బాలకృష్ణ సినిమాల్లోని ఆయన ఐకానిక్ డైలాగ్‌లు, యాక్షన్ సన్నివేశాలతో ఈ వీడియోను రూపొందించారు. ‘స్క్విడ్ గేమ్’లోని టఫ్ ఛాలెంజ్‌లను బాలయ్య తనదైన స్టైల్‌లో ఎదుర్కొని, ప్రత్యర్థులను దబిడి దిబిడే చేస్తూ కనిపిస్తారు. ఈ వీడియోలోని హాస్యం, బాలయ్య ఎనర్జీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ అవుతూ, అభిమానులు దీనిపై స్పందిస్తున్నారు. “బాలయ్య స్క్విడ్ గేమ్ ఆడితే.. అందరూ అయిపోయినట్లే” అంటూ కామెంట్స్‌తో సందడి చేస్తున్నారు. బాలకృష్ణ యాక్షన్ సినిమాల్లో చూపించే డైనమిక్ ఎనర్జీ, డైలాగ్ డెలివరీని ఈ గేమ్‌లో ఊహించడం అభిమానులకు కొత్త థ్రిల్‌ను అందిస్తోంది. అనసూయ, రాజీవ్ కనకాల కాంబినేషన్ కూడా ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచింది. ఈ ఏఐ వీడియో అభిమానులకు హాస్యాన్ని, ఉత్సాహాన్ని అందిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa