ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను నీలా 50 శాతం నటించగలిగినా బాగుండు అంటూ రష్మిక పోస్టు

cinema |  Suryaa Desk  | Published : Sun, Jul 27, 2025, 07:17 PM

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కింగ్‌డమ్. ఈ చిత్రం జులై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై విజయ్ సన్నిహితురాలు రష్మిక మందన్న స్పందించారు. నిన్న రిలీజైన కింగ్‌డమ్ ట్రైలర్ చూశాక తన అభిప్రాయాలను పంచుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆమె "నువ్వు నిజంగా అద్భుతం. నేను నీలా 50 శాతం నటించగలిగితే బాగుండు. ఈ ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని నాలుగు రోజుల నుంచి వెయిటింగ్ నేనెప్పుడూ చెబుతుంటాను నువ్వు మామూలోడివి కాదని" అంటూ విజయ్ అభినయాన్ని ఉద్వేగభరితంగా పొగిడారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, ఆయన విజన్, మరియు కథను చెప్పిన విధానంపై రష్మిక ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ట్రైలర్‌కు ప్రాణం పోసిందని తెలిపారు. ఈ సినిమా కోసం తాను ఆతృతగా ఎదురుచూస్తున్నానని రష్మిక వెల్లడించారు. అలాగే, చిత్ర బృందం మొత్తానికి, ముఖ్యంగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు.  రష్మిక వ్యాఖ్యలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. విజయ్ దేవరకొండ-రష్మిక మధ్య అనుబంధం ఉందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో, రష్మిక వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కింగ్‌డమ్ చిత్రానికి తన వ్యాఖ్యల ద్వారా రష్మిక ప్రమోషన్ చేస్తున్నట్టుందని నెటిజన్లు అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa