కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ యువ నటుడు తేజా సజ్జా తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మిరాయి' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ పాన్-ఇండియా యాక్షన్-అడ్వెంచర్ చిత్రం తేజా సజ్జాని సూపర్ యోధా పాత్రలో చూపించనుంది. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు విలన్ పాత్రలో నటిస్తున్నారు. రితికా నాయక్ ప్రముఖ మహిళ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఆగష్టు 28న ఉదయం 10:30 గంటలకి హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో స్క్రీన్ 2లో నిర్వహిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని రేపు మధ్యాహ్నం12:06 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రాకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న 2డి మరియు 3డి ఫార్మాట్లలో 8 వేర్వేరు భాషలలో ప్రపంచవ్యాప్తంగా గొప్ప విడుదల కానుంది. ఈ సినిమని టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa