ప్రముఖ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైథ్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ యూత్ ఎంటర్టైనర్ ని ప్రకటించారు. కీర్తిస్వారాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి 'డ్యూడ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో మామిత బైజు మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తెలుగు సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో సీనియర్ నటులు శరత్ కుమార్ మరియు రోహిని మొల్లెటి కీలక పాత్రలలో ఉన్నారు. యంగ్ కోలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ సాయి అభ్యంకార్ ట్యూన్లను కంపోజ్ చేయనున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషలలో దీపావళి 2025 సందర్భంగా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa