అరుణ్ ప్రభు దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు - దర్శకుడు - మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ తన తదుపరి 25వ ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో 'భద్రకాళి' అనే పేరుతో విడుదల అవుతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ని తెలుగురాష్ట్రాలలో ఆసియాన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ విడుదల చేయనుంది. ఈ సినిమాని మేకర్స్ భారీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో వాఘా చంద్రశేఖర్, సునీల్ కృపలాని, సెల్ మురుగన్, ట్రిప్టి రవీంద్ర, మరియు మాస్టర్ కేశవ్ కీలక పాత్రల్లో ఉన్నారు. సినిమాటోగ్రఫీ మరియు బిజిఎంలను వరుసగా షెల్లీ కాలిస్ట్ మరియు విజయ్ ఆంటోనీ నిర్వహిస్తున్నారు. స్రవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa