ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఒక ప్రాజెక్ట్ కోసం జత కట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ట్రిపుల్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రం శక్తివంతమైన డాన్ చుట్టూ తిరుగుతుంది మరియు మాఫియా నేపథ్యం ఉంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, దీపికా పదుకొనే 2025 చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం. ఆమె యాక్షన్-సెంట్రిక్ భాగాలు భారతదేశం మరియు విదేశాలలో చిత్రీకరించబడతాయి. అంధేరిలోని చిత్రకూట్ గ్రౌండ్స్ లో అల్లు అర్జున్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించారు. ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మాగ్నమ్ ఓపస్ చిత్రంలో స్టార్ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ మహిళా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. యువ తమిళ సంగీత దర్శకుడు సాయి అభ్యంక్కర్ సౌండ్ట్రాక్ను స్కోర్ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa