ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టికెట్ బుకింగ్ పార్టనర్ ని ఖరారు చేసిన 'ఘాటీ'

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 02, 2025, 07:46 PM

ప్రముఖ నటి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ భారీ స్థాయిలో దర్శకత్వం వహించిన తెలుగు చిత్రాలలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఘాటి' ఒకటి. ఈ చిత్రం సెప్టెంబర్ 5, 2025న పెద్ద స్క్రీన్‌లపైకి రానుంది. ఈ సినిమాని మేకర్స్ భారీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా యొక్క టికెట్ బుకింగ్ పార్టనర్ గా డిస్ట్రిక్ట్ యాప్ ని లాక్ చేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈచిత్రంలో  ప్రముఖ తమిళ నటుడు విక్రమ్ ప్రభు, జగపతి బాబు, చైతన్య రావు, రావేంద్ర విజయ్, జాన్ విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఘాతీ పాన్-ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి విద్య సాగర్ సంగీతాని అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa