నూతన దర్శకుడు నంద కిషోర్ ఈమని దర్శకత్వంలో నటి నివేతా థామస్ నటించిన చిత్రం '35-చిన్న కథ కాదు' తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో సినిమా విడుదల అయ్యింది. ఈ కంటెంట్-రిచ్ మూవీలో ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ మరియు గౌతమి కీలక పాత్రలలో నటిస్తున్నారు. దర్శకుడు నంద కిషోర్ ఈమని సరళమైన మరియు మనోహరమైన కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం సెప్టెంబర్ 5, 2025న టీచర్స్ డే సందర్భంగా మేకర్స్ మళ్ళి ఈ సినిమాని థియేటర్స్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియాజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. అకడమిక్ ఒత్తిడి యొక్క సార్వత్రిక పోరాటాన్ని మరియు తిరుగులేని తల్లిదండ్రుల మద్దతు యొక్క ప్రభావాన్ని ఈ క్లీన్ ఫ్యామిలీ డ్రామా అన్వేషిస్తుంది. ఈ చిత్రంలో భాగ్యరాజ్, కృష్ణ తేజ, అరుణ్ దేవ్, అభయ్ మరియు అనన్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సృజన్ యరబోలు మరియు సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రాని ప్రముఖ రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa