ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తెలుసు కదా' షూటింగ్ ని పూర్తి చేసుకున్న రాశి ఖన్నా

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 08, 2025, 03:28 PM

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తదుపరి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'తెలుసు కదా' అనే చిత్రంతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంతో ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతోంది. గార్జియస్ బ్యూటీస్ రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. వైవా హర్ష ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఇప్పుడు నటి రాశి ఖన్నా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నటి సోషల్ మీడియాలో సెట్స్ నుండి కొన్ని చిత్రాలని పోస్ట్ చేసింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. చార్ట్-టాపింగ్ మ్యూజిక్‌కి పేరుగాంచిన థమన్ ఎస్ సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా జ్ఞాన శేఖర్ బాబా, ఎడిటర్ గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్ గా  అవినాష్ కొల్లా మరియు కాస్ట్యూమ్ డిజైనర్ గా శీతల్ శర్మ ఉన్నారు. ఈ చిత్రం అత్యున్నత నిర్మాణ విలువలు మరియు భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 17, 2025న దీపావళి స్పెషల్‌గా విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa