ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న 'మత్తు వదలారా 2'

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 02:54 PM

రితేష్ రానా దర్శకత్వం వహించిన 2024 తెలుగు సూపర్హిట్ 'మత్తు వదలారా 2' బాక్స్ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించింది. ఈ చిత్రంలో శ్రీ సింహ కోడూరి, సత్య మరియు ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా నేటితో విడుదలై ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి మరియు గుండు సుదర్శన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ, సినిమాటోగ్రఫీ సురేష్ సారంగం మరియు ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ ఆర్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa