ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కల్యాణ్‌తో తీసుకున్న సెల్ఫీని షేర్ చేసిన రాశీ ఖన్నా

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 07:18 PM

పవన్ కల్యాణ్ ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు సినిమా షూటింగ్‌లను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'కు సంబంధించి తన పాత్ర చిత్రీకరణను తాజాగా పూర్తి చేశారు. ఈ విషయాన్ని చిత్ర కథానాయిక రాశీ ఖన్నా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పవన్ కల్యాణ్‌తో కలిసి సెట్‌లో తీసుకున్న ఒక సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన రాశీ ఖన్నా, ఆయనతో కలిసి పనిచేయడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో పవన్ కల్యాణ్ గారి షూటింగ్ పూర్తయింది. ఆయనతో కలిసి ఈ సినిమాలో నటించడం ఒక అద్భుతమైన అనుభూతి. ఇది నాకు దక్కిన నిజమైన గౌరవం. ఈ జ్ఞాపకాన్ని ఎప్పటికీ మర్చిపోలేను" అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఈ ఫొటోలో పవన్ కల్యాణ్ సెల్ఫీ తీస్తుండగా, రాశీ ఖన్నా చిరునవ్వుతో కనిపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa