by Suryaa Desk | Sun, Aug 11, 2024, 03:11 PM
సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్-2ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. అనంతరం పంప్ హౌస్ ట్రయల్ రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రీడిజైన్ పేరుతో గత పాలకులు రూ.8 వేల కోట్లు వృథా చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయని మంత్రి తుమ్మల అన్నారు. డిస్ట్రిబ్యూటరీ కాలువలు త్వరగా పూర్తి చేయాలన్నారు.