by Suryaa Desk | Mon, Sep 09, 2024, 03:55 PM
ఖైరతాబాద్ గణనాథుడు ప్రజల సర్వ విఘ్నాలను తొలగించి సర్వ శుభాలను ప్రసాదించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు, వినాయక చవితి వేడుకలను పురస్కరించుకొని సోమవారం ఖైరతాబాద్ లోని వినాయకుడిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద వినాయకుడిగా ప్రాచుర్యం పొంది, కోరిన కోరికలు తీర్చే గణపతిగా వినాయక నవరాత్రులలో లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణనాథున్ని దర్శించుకుంటారని తెలిపారు. విజ్ఞాధిపతి అయిన ఆ లంబోదరుడి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు, ఖైరతాబాద్ గణనాథుడి ఆశీస్సులతో ప్రకృతి వైపరీత్యాలు తొలగి ఉభయ తెలుగు రాష్ట్రాలు సుఖశాంతులతో పరిఢవిల్లాలని కోరుకున్నారు, ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్, సభ్యులు వీణ, అమీన్పూర్ కౌన్సిలర్ కొల్లూర్ మల్లేష్,ముకేష్,రాజశేఖర్, వి నారాయణ రెడ్డి, అశోక్,ఖైరతాబాద్ యూత్ సభ్యులు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు,తదితరులు పాల్గొన్నారు