by Suryaa Desk | Sun, Sep 15, 2024, 11:12 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సింది పోయి ప్రైవేటు పాఠశాలలను చిన్నచూపు చూడటం, ఉపాధ్యాయులను తక్కువ చేసి మాట్లాడటం సీఎం రేవంత్ రెడ్డికి తగదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలో ట్రెస్మా ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు 242 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి సన్మానించారు.