by Suryaa Desk | Wed, Sep 18, 2024, 01:24 PM
పట్టణంలోని పలు కార్యాలయాల్లో మంగళవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమాలు చేపట్టారు. మేట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రణవేణి సుజాత సత్యనారాయణ పతాక ఆవిష్కరణ చేసి ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా జరిపారు .ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు మున్సిపల్ కమిషనర్ టి మోహన్, మేనేజర్ వెంకటలక్ష్మి ఆర్ఐ అక్షయ్ ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ ముజీబ్ కౌన్సిలర్ మొరపు గంగాధర్ నాయకులు బర్ల రమేష్ ఊజగిరి శ్రీనివాస్ రాజారామ్ హనుమాన్లు మున్సిపల్ స్టాప్ పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో.. మెట్ పల్లి పట్టణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ కె వెంకయ్య పథక ఆవిష్కరణ చేశారు. ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య వల్లే తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మనోజ్, అంజయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.