by Suryaa Desk | Thu, Sep 19, 2024, 03:30 PM
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రోజున కొండ భీమనపల్లి పరిధిలో ఉన్నటువంటి మైనార్టీ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు పాఠశాలలో నుండి బయటికి పారిపోయి వారి జడ దొరకని పరిస్థితి చోటుచేసుకుంది.
ఈ విషయం తెలిసిన వెంటనే ఏబీవీపీ కార్యకర్తలు అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మరియు ఆర్సిఓతో మాట్లాడి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ యొక్క పాఠశాల ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలని పాఠశాల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యలమల గోపీచంద్ మాట్లాడుతూ మైనార్టీ గురుకుల పాఠశాలలో నుండి ముగ్గురు విద్యార్థులు పారిపోవడం ఈ యొక్క పాఠశాలకు సిగ్గుచేటు అంటూ ఈ యొక్క గురుకుల పాఠశాలలో సరైన వసతులు లేకపోవడం విద్యార్థుల పట్ల చిత్త శుద్ధి లేకుండా పాఠశాల యాజమాన్యాలు ప్రవర్తిస్తున్న వారిపట్ల చర్యలు తీసుకోకుండా విద్యాధికారులు విద్యార్థుల సమస్యలు తెలుసుకోకుండా దున్నపోతుపై వాన కురిసినట్టు వివరిస్తున్న ఈ యొక్క అధికారుల వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
ఈ యొక్క నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ అని గొప్పలు చెప్పుకుంటారు గానీ విద్యార్థుల పట్ల విద్యార్థుల జీవితాల పట్ల ఎలాంటి శ్రద్ధ శ్రద్ధ లేని పరిస్థితి ఈ యొక్క నల్గొండ జిల్లాలో మనం చూస్తున్నాము .గతంలో ఈ యొక్క గురుకుల పాఠశాలలోనే 13 మంది విద్యార్థులకు ఎలుకలు కరిచినప్పటికీ మరొక గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరైన భోజనం అందించకుండా వారికి ఫుడ్ పాయిజన్ అయినప్పటికీ హాస్పిటల్ బారిన పడ్డ పరిస్థితి మనకు తెలిసిందే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఎలాంటి శ్రద్ధ లేకుండా నడుస్తున్న ఈ యొక్క ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సూటిగా తెలియజేస్తుంది. ఈ యొక్క గురుకుల పాఠశాలల మీద వెంటనే సరైన విచారణ జరిపించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు డిమాండ్ చేస్తుంది. లేనియెడల రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షుడు శివశంకర్, ఆసిఫ్, సిద్దు, సోయఫ్, భరత్, ఉమర్ ఫారూఖ్ తదితరులు పాల్గొన్నారు.