by Suryaa Desk | Thu, Sep 19, 2024, 03:30 PM
సెప్టెంబర్ మాసంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, డిండి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో బుధవారం కార్యక్రమం నిర్వహించారు. కిషోర్ బాలికలకు హ్యాండ్ వాష్, మరియు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గర్భిణీలకు శ్రీమంతము, పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దిండి తహసిల్దార్ ఆంజనేయులు పాల్గొని ప్రసంగించారు. పోషక విలువల గురించి వివరించారు. చిన్నారులకు విద్య ఆవశ్యకత గురించి ముఖ్యంగా, బాలికల విద్యపై తీసుకోవలసిన చర్యలపై ప్రసంగించారు. దేవరకొండ ఐసిడిఎస్, సిడిపిఓ చంద్రకళ మాట్లాడుతూ కిశోర బాలికలు తీసుకోవాల్సిన ఆహారం, పాటించవలసిన జాగ్రత్తలు, చిరు ధాన్యాలు, సిరి ధాన్యాలు ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని, ఐరన్ ఫుడ్ ఎక్కువగా తినాలని వివరించడం జరిగింది.