by Suryaa Desk | Wed, Sep 18, 2024, 01:23 PM
మెట్ పల్లి పట్టణంలోని శాస్త్రి చౌరస్తా వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గల్ఫ్ ఎన్నారై పాలసీ జీవో విడుదలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గల్ఫ్ బోర్డు ఎన్నారై పాలసీ తీసుకువచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మరియు పలువురు జిల్లా మంత్రులు, విప్, ఎమ్మెల్యేల, నియోజకవర్గ నాయకులు జువ్వాడి నర్సింగరావు, కృష్ణారావుల ఫ్లెక్సీ ఫోటోలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ప్రజా పాలన పురస్కరించుకొని జాతీయ జెండా ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జట్టిలింగం, మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, సీనియర్ నాయకులు ఆకుల లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి రాంప్రసాద్, కౌన్సిలర్ రాజయ్య, మాజీ వైస్ చైర్మన్ కోఆప్షన్ మార్గం గంగాధర్, పూదారి నర్సాగౌడ్, పొట్ట రాజేశ్వర్, రమేష్, ముఖిమ్, జాకీర్, రాజగోపాల్, షేక్ మహ్మద్ శంకర్ చరణ్ సింగ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.