by Suryaa Desk | Tue, Sep 17, 2024, 04:14 PM
కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగవారం బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి, హైదరాబాద్ సంస్థానం మాత్రం చీకటిలోనే ఉండిపోయిందని, 1948 సెప్టెంబర్ 17న వల్లభాయ్ పటేల్ కృషితో హైదరాబాద్కు స్వేచ్ఛ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో స్టడీ సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.