by Suryaa Desk | Mon, Sep 16, 2024, 08:44 PM
కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం తెలిపారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారని చెప్పారు.