by Suryaa Desk | Mon, Sep 16, 2024, 10:28 AM
గణేషుడి నిమజ్జనాలు జరిగేటప్పుడు ఎలాంటి అవరోధాలు లేకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ప్రతి వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలి.
విగ్రహాలను పట్టుకోవడం, తీర్థ ప్రసాదాల పంపిణీ బాధ్యతలు పిల్లలకు అప్పగించకూడదు.
క్రేను సాయంతో విగ్రహాలను నిమజ్జనం చేయాలి.
మార్గమధ్యలో రహదారికి అడ్డంగా కిందికి వేలాడుతూ ఉండే విద్యుత్ తీగలతో ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలి.