by Suryaa Desk | Sun, Sep 15, 2024, 10:53 PM
దేవరకొండ పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేరేడుగోమ్ము మండలం,పెద్ద మునిగల్ గ్రామానికి చెందిన కేతావత్ రవీందర్ నాయక్ కాకతీయ యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్ విభాగంలో డాక్టరేట్ పొందినందుకు బీసీ సంక్షేమ సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదు అని మొక్కవోని ధైర్యంతో బీదకుటుంబంలో జన్మించిన.
వ్యక్తి రవీంద్ర నాయక్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా తెలంగాణ రాష్ట్ర సాధన నే లక్ష్యంగా పనిచేసి ఉన్నత స్థాయిలో డాక్టర్ పట్టా పొంది పేద ప్రజలకు, సమాజానికి,సంఘానికి,సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతూ అన్ని వర్గాలకు సేవ చేస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చోల్లేటి భాస్కరాచారి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి అంకం చంద్రమౌళి,కూరెళ్ళ కృష్ణ చారి,గౌరోజు బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.