by Suryaa Desk | Wed, Sep 18, 2024, 01:14 PM
అంగన్వాడీ టీచర్ల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటియుసి జిల్లా నాయకులు చిరంజీవి అన్నారు.నారాయణఖేడ్ ఏఐటియుసి కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్ ఎదురుకుంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు 1975 సంవత్సరం లో బడుగు బలహీన వర్గాల పిల్లలు రక్త హీనతకు గురికావద్దన్న ఉద్దేశం తో అప్పుడున్న ప్రభుత్వం ప్రతి ప్రక్షాల ఒత్తిడి ICDS ను ఏర్పాటు చేసిందన్నారు. అప్పడి నుండి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు బడుగు బలహీన వర్గాల పిల్లలకు సేవాలందిస్తున్నారని కొనియాడారు. అంగన్వాడీ ఉద్యోగులు 1975 నుండి చాలి చాలని అతి తక్కువ వేతనం పొందుతూ కుటుంబ పోషణ భారంగా జీవితాలను వెళ్ళదిస్తున్నారని అన్నారు.అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం రూ.లు 26,000/- హెల్పర్లకు రూ.లు 21,000/- ఇవ్వాలని గతంలో అనేక సార్లు పోరాటాలు చేసి గత ప్రభుత్వం హయాంలో 24 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టడం తో గత ప్రభుత్వం సమ్మె లో భాగంగా అంగన్వాడీ ఉద్యోగుల తో యూనియన్ నాయకులతో జరిపి అంగన్వాడీ టీచర్లకు రూ.లు 18,000/- ఎల్పర్ల కు రూ.లు 15,000/-ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ నాటి ప్రభుత్వం కూడా అధికారంలోకి రావటంతో వేతనం పై విధముగా పెంచుతామని ఈ నాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీఇచ్చారు అదే విధంగా రిటైర్మెంట్ అవుతున్న అంగన్వాడీ టీచర్లకు రూ.లు 2.00,000/- ఎల్పర్లకు రూ.లు 1.00,000/- ఇస్తామని ఇప్పుడేమో టీచర్లకు లక్ష ఎల్పర్లకు 50 వెయిలు ఇస్తామని G.O కాపీని ఇచ్చారు దీని వలన గత 40 ఏళ్లుగా డిపార్ట్మెంట్ నమ్ముకొని పనిచేసిన కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుంది కావున అట్టి G.O కాపీని వెంటనే రద్దు చేసి సమ్మె కాలములో ఇచ్చిన హామీలను అమలు పరచాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రభుత్వన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు ఉప్పల అశోక్ గణపతి రాము సతీష్ తదితరులు పాల్గొన్నారు.