by Suryaa Desk | Thu, Sep 19, 2024, 03:22 PM
పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించాలని అది తల్లిదండ్రుల బాధ్యత అని కోహెడ ఎస్సై పి అభిలాష్ అన్నారు. బుధవారం రోజున కోహెడ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఆంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం ని నిర్వహించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో స్థానిక ఎస్సై అభిలాష్ పాల్గొని విద్యార్థులకు మద్యపానం ధూమపానం డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను వివరించడం జరిగినది. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెట్టి ఉన్నత స్థానాలలో స్థిరపడాలని కోరడం జరిగినది. తల్లిదండ్రులు వారి బాగోగులతో పాటు వారు సరైనా మార్గంలో వెళ్తున్నారో లేదో తప్పక గమనించాలి.
డ్రగ్స్ మరియు ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.డ్రగ్స్ మత్తుకు బానిసగా మారిన యువత కుటుంబంతో పాటు సమాజానికి ప్రమాదకరం.డ్రగ్స్ నుండి పిల్లల్ని కాపాడే బాద్యత పోలీసులకి ఎంత ఉందో, తల్లిదండ్రులకి అంతే ఉంది.మన పిల్లల్ని సరైన మార్గంలో నడిపి డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దుదాంఅని అన్నారు.కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపాల్ కోతి యాదగిరి, అధ్యాపకులు రాజేశ్వర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రజిత, నీరజ,యు శ్రీనివాస్,ఎస్ శ్రీనివాస్, అశోక్, సీతారామయ్య నరేష్,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజమౌళి, లైబ్రేరియన్ సుజాత విద్యార్థులు పాల్గొన్నారు.