by Suryaa Desk | Wed, Sep 18, 2024, 01:30 PM
గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మాణం అందోలు మండలం అల్మాయిపేట గ్రామంలో సంపూర్ణ మద్యం విక్రయాలను బంద్ చేయాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మాణంచారు. మద్యం విక్రయాలను స్థానిక కిరాణ షాపులల్లో విక్రయాలు జరపకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం జోగిపేటలోని ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ సాగర్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఆగస్టు15, 25 తేదీల్లో మద్యపాన విక్రయం నిషేదిస్తూ ఏకగ్రీవంగా గ్రామంలో తీర్మాణం చేయడం జరిగింది.
అయిన యధావిధిగా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయని, ఈనెల 10వ తేది నుంచి సంపూర్ణంగా మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఈనెల 9వ తేదిన కూడా గ్రామస్తులంతా తీర్మాణించి విక్రయదారుల సంతకాలు కూడా సేకరించినట్లు వారు పేర్కొన్నారు. గ్రామంలో సంపూర్ణంగా మద్యపాన విక్రయాలు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు.