by Suryaa Desk | Tue, Sep 17, 2024, 08:48 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం. పెబ్బేరు మండలం రంగాపురం గ్రామానికి సమీపంలోని పోగాకు కంపెనీ వద్ద జాతీయ రహదారిపై హైదారాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న ఆర్టీసీ సూపర్ డీలక్స్ బస్సు, టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఎక్స్ఎల్ పై ఉన్న పెండ్లి రాముడు అక్కడిక్కడే మృతి చెందగా శేఖర్ ఆసుపత్రికు తరలిస్తున్న మార్గమధ్యలో మృతి చెందాడు.