by Suryaa Desk | Tue, Sep 17, 2024, 02:03 PM
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ ముగిసింది. మంగళవారం ఉదయం ప్రారంభమైన శోభయాత్ర వేలాది భక్తుల సందడి మధ్య మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంది. ఎన్టీఆర్ మార్గ్ లోని 4వ నెంబర్ క్రేన్ వద్ద బడా గణేష్ నిమజ్జనం పూర్తైంది.ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తైంది. భక్తుల కోలాహలం మధ్య మంగళవారం మధ్యాహ్నం ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద బడా గణేషుడిని నిమజ్జనం చేశారు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన గణేషుడి శోభయాత్ర మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంది. మహా గణపతి శోభయాత్రలో వేలాది భక్తులు పాల్గొన్నారు.