by Suryaa Desk | Mon, Sep 16, 2024, 04:07 PM
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలకల్ స్టేజీ గ్రామంలో సోమవారం జగన్ (22) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జగన్ తండ్రి రఘుకు రెండు ఇళ్లు ఉన్నాయి. ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగా, మరో ఇంట్లోకి వెళ్లి జగన్ మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి చూడగా ఉరేసుకొని మృతి చెందినట్లు గుర్తించారు. విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు.