by Suryaa Desk | Sun, Sep 15, 2024, 08:03 PM
జోగిపేట పట్టణంలోని 17వ వార్డులోని తూర్పు గౌని ముదిరాజ్ సంఘ భవనంలో ప్రతిష్టించిన వినాయక మండపం వద్ద శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక విగ్రహం వద్ద మున్సిపల్ కౌన్సిలర్ చిట్టిబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో స్థానిక మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
పట్టణంలోని బృందావన్ కాలనీలో ప్రతిష్టించిన వినాయక మండపం వద్ద, 13వ వార్డులో ప్రతిష్టించిన వినాయక మండపం వద్ద లయన్స్క్లబ్ సభ్యుడు కాసాల ప్రవీణ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బృందావన్ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.