by Suryaa Desk | Wed, Sep 18, 2024, 02:56 PM
వినాయక విగ్రహాల నిమజ్జం సందర్భంగా కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన కొంతమంది ముస్లిం యువకులు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు మానకొండూర్ చెరువు వద్ద కు వచ్చిన భక్తులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మహ్మద్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో కొంత మంది యువకులు స్టాల్ ను ఏర్పాటు చేసి ఉచితంగా మంచినీటి బాటిళ్లు, బిస్కిట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఇర్ఫాన్ మాట్లాడుతూ సర్వమత సామరస్యానికి హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు.
ఇరు మతాల పండుగలను పరస్పరం గౌరవించుకోవడం మన అందరి సాంప్రదాయం కావాలన్నారు.సాంప్రదాయానికి కట్టుబడుతూ వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా హింధూ భక్తులకు బిస్కిట్ ప్యాకెట్లు, మంచినీటి బాటిళ్లు అందించామని ఇర్ఫాన్ వివరించారు.ఈ స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముస్లిం మత పెద్ద మౌలానా ముఫ్తీ నదీమొద్దీన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డితోపాటు కోండ్ర సురేశ్, కె.శంకర్, జడల రమేశ్, ఎండీ అజహర్, మహ్మద్ మహమూద్, తాళ్లపల్లి నరేశ్ తదితరులు పాల్గొన్నారు. నిమజ్జనం సందర్భంగా మంచినీరు, బిస్కెట్లు అందించిన ఇర్ఫాన్ ను, ఆయన మిత్ర బృందాన్ని మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అభినందించారు.