by Suryaa Desk | Tue, Sep 17, 2024, 03:24 PM
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల పరిధిలోని జులేకల్ గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వచ్ఛత సేవా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో నాటుదాం ప్రోగ్రామ్ నిర్వహించి, "అమ్మ పేరుమీద" ఒక మొక్కను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో, ఏబీవోలు, టీఏలు, సీసీలు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, మరియు గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.