by Suryaa Desk | Wed, Sep 18, 2024, 03:05 PM
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలపైన స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ యాదగిరికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ. విద్యారంగం లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉందని నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యను పెడచెవు నా పెడుతూవిద్యనువిస్మరిస్తుందనిఅన్నారు.
జిల్లా వ్యాప్తంగావిద్యారంగ సమస్యలు పరిష్కరించాలనీ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు అస్తవ్యస్తంగా మారాయని వాటిని పట్టించుకునే నాధుడే కరువయ్యాడని, సబ్జెక్టులకు సరిపడా టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు .ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐనాయకులుజునైదు,శివకుమార్,నూతన్, సాయి అంజేశ్వర్,వికాస్,బన్నీ,ముజాహైకిర్ తదితరులు పాల్గొన్నారు.