by Suryaa Desk | Wed, Sep 18, 2024, 03:07 PM
గల్ఫ్ కార్మికులు బయటి దేశంలో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారాన్ని అందించాలనీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసిన సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్లో మంగళవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారితో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు*
ఈ సందర్భంగా మాట్లాడుతూ..
గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ మేనిఫెస్టో రూపకల్పన చేసే సమయంలో సూచన చేయడం జరిగిందని, ఎన్నికల సమయంలో గల్ఫ్ కార్మికుల సమస్యలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మేము కూలంకుషంగా చర్చించడం జరిగిందనీ,కేవలం ఎన్నికల కోసమే కాకుండా ప్రభుత్వం గల్ఫ్ కర్మికుల అంశం పైన కట్టుబడి ఉండే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని,రేషన్ కార్డుల జారీ విషయంలో కూడా జిల్లా తరఫున ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంబంధిత శాఖ మంత్రి వర్యులు ఉత్తం కుమార్ రెడ్డి కి సూచనలు ఇవ్వడం జరిగిందని,పారదర్శకంగా రేషన్ కార్డుల జారిని చేపడుతామని ఈ సంధర్బంగా తెలిపారు.