by Suryaa Desk | Thu, Sep 19, 2024, 04:27 PM
మహబూబాబాద్ జిల్లా, శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు, గూడూరు మండల కేంద్రంలో సుమారు, 2 లక్షల సీఎంఆర్ఎఫ్ రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ చెక్కులను పాండవుల పద్మ, ఎలికట్టే జయంత్, ధారావత్ జామ్ల, మహబూబ్ పాషా వీరి కుటుంబాలకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం శ్రీపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వాంకుడోత్ కొమ్మాలు నాయక్, జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ చంటి స్వామి, జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎండి. రసూల్, ప్రచార కమిటీ అధ్యక్షులు ఎలమందల శ్రీనివాస్, మండల మైనార్టీ ప్రెసిడెంట్ ఎస్.కె. సయ్యద్ పాషా, మండల సీనియర్ నాయకులు ఎడ్ల అశోక్ రెడ్డి, రూప్ రెడ్డి వెంకట్ రెడ్డి, రాస మల్ల రాములు, కార్యకర్తలు పాల్గొన్నారు.