by Suryaa Desk | Wed, Sep 18, 2024, 01:27 PM
తిప్పర్తి లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభల సందర్భంగా సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సాయుధ పోరాట యోధులకు జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన మహోత్తమైనా పోరాటంలో ఆయుధాన్ని ధరించి గెరిల్లా దళములో మండలంలోని వారుకూడా పనిచేసిన నాయకులు ఉన్నారు. సాయుధ పోరాటానికి ఎలాంటి సంబంధం లేని బిజెపి నేడు అది ఒక ముస్లిం పై హిందువులు పోరాడి విమోచన కలిగించారని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. భారత సైన్యాలు కమ్యూనిస్టులను ఊచకోత కోశారని రజాకారులతో చేతులు కలిపి అధికార మార్పిడి చేసుకొని రాజభరణాలు చెల్లిస్తూ గవర్నర్గా ప్రకటించుకున్నారని అన్నారు.
ఆనాడు తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తూ భారత సైన్యం దొరలకు భూస్వాములకు అండగా నిలిచిందని ఆరోపించారు. నేడు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను మార్పులు చేస్తూ కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఆనాటి స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. అదే స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం రైతాంగానికి మద్దతు ధర, ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు భీమగాని గణేష్ పోకల శశిధర్ రోట్టెల జానయ్య సంకోజు శరత్ దారముల యాదయ్య మస్తాన్ జక్కల నాగయ్య యాదయ్య లింగయ్య అంజయ్య గురుమూర్తి రాజు బిక్షం నాగరాజు శంకర్ రవీందర్ సంపత్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు