by Suryaa Desk | Tue, Sep 17, 2024, 03:05 PM
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని అవమానించారంటూ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో బీఆర్ఎస్ వి జిల్లా సమన్వయకర్త పల్లయ్య ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించారని, తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి వెంటనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.