by Suryaa Desk | Sun, Sep 15, 2024, 10:38 PM
మండపాలలో వినాయకుడిని ఏర్పాటు చేయడం కామన్.. కానీ ఆ యూత్ సభ్యులు వినూత్నంగా ఆలోచించారు.. ఏకంగా డీసీఎం లోనే వినాయకుడిని నెలకొల్పారు. అది కూడా సాధారణమే అనిపించొచ్చు కానీ డీసీఎం లో ఉయ్యాల ఏర్పాటు చేసి ఉయ్యాలలో వినాయకుడిని ప్రతిష్టించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామంలో స్కై బ్లూ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది.
అందరిలా కాకుండా ఏదో ఒక కొత్త ఆలోచనతో ముందుకు వెళ్లాలని ఆలోచించారు స్కై బ్లూ యూత్ సభ్యులు. అందరినీ ఆకట్టుకునే విధంగా డీసీఎం లో గణపతిని ఏర్పాటు చేసి వినూత్నంగా అనుకునే లోపే ఉయ్యాలలో ఏర్పాటుచేసి మరింత కొత్తదనాన్ని చాటిచెప్పారు. ఉయ్యాలలో నిత్య పూజలు అందుకుంటున్న గణపయ్యను చూడడానికి భక్తులు ఆసక్తి కనబరచడంతో పాటు యూత్ సభ్యులను సైతం ప్రశంసిస్తున్నారు.