by Suryaa Desk | Wed, Sep 18, 2024, 12:32 PM
కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్యూనిటీ ఆసుపత్రిని బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి హెల్త్ సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల హెల్త్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆస్పత్రిలో వసతులను గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. హెల్త్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చాలని తెలిపారు.