by Suryaa Desk | Thu, Sep 19, 2024, 04:32 PM
మాదారం గ్రామంలో వారానికి ఒకరోజు వైద్య సేవలు అందించాలని గ్రామ కాంగ్రెస్ నాయకులు జిన్నారం పీ హెచ్ సీ వైద్యురాలు కోమలి ని కోరారు. గ్రామంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయని వైద్యురాలు దృష్టికి తీసుకువచ్చారు. మాదారం గ్రామంలో నిరుపేదలు, కూలీలు ఎక్కువగా ఉన్నారని.
డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో వారానికి ఒక రోజు గ్రామంలో వైద్య సేవలు ఏర్పాటు చేయాలని కోరగా స్పందించిన డాక్టర్ కోమలి గ్రామంలో వైద్య సేవలు అందిస్తామని తెలిపారని, గురువారం మాదారం గ్రామాన్ని విజిట్ చేస్తానని చెప్పినట్లు గ్రామ నాయకుడు రాజు గౌడ్ తెలిపారు. సీతారాం యాదవ్, రాజుసింగ్, లక్ష్మన్ యాదవ్, సుదర్శన్ పాల్గొన్నారు.