by Suryaa Desk | Wed, Sep 18, 2024, 01:11 PM
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అశోక్ నగర్ ,సనా ఇంజనీరింగ్ విద్యాసంస్థల యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.గణేష్ నవరాత్రులలో భాగంగా మంగళవారం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ఆ విగ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజల పై ఉండాలని, గణేష్ శోభయాత్రలో ఎటువంటి ఆటంకాలు లేకుండా, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నయీమ్, ఆబీదర్ నాయుడు, కర్ల సుందర బాబు, ఆరిఫ్, అబ్బు ,కమాన్, కిమ శ్రీను, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.