by Suryaa Desk | Thu, Sep 19, 2024, 04:38 PM
మండలంలోని గూడూరుపాడు పంచాయతీ గుండాల తండలో మైనర్ బాలిక సూసైడ్ చేసుకున్న విషాదకర ఘటన బుధవారం చోటు చేసుకుంది. లావణ్య అనే మైనర్ బాలికను మరో వివాహిత మహిళ వేధించడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగిన బాలిక చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుండాల తండాకు చెందిన భూక్య లావణ్య(17) ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతూ హాస్టల్లో ఉంటుంది. యువతి పండుగలకు ఇంటికి వచ్చి బాలికతో అదే గ్రామానికి చెందిన అజ్మీర గోపి అనే వ్యక్తి లావణ్యతో బాలిక తండ్రి ఫోన్ ద్వారా మాట్లాడేవాడు. వీరిద్దరూ మాట్లాడుకునే విషయాన్ని గమనించిన గోపి భార్య అజ్మీరా రేణుక తన భర్తతో మాట్లాడొద్దని లావణ్యను బెదిరించింది. అంతటితో ఆగకుండా తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని గ్రామంలో ప్రచారం చేసింది.
లావణ్యను పలుమార్లు తిట్టడమే కాకుండా ఇలాంటి బ్రతుకు బ్రతికేకన్నా చావాలని బాలికను వేదింపులకు గురి చేసింది. భార్య రేణుకకు ఆమె భర్త అజ్మీరా గోపి, మామయ్య అజ్మీరా బాసు కూడా సపొర్టు చేశారు. వీరందరి వేదింపులకు మనస్థాపం చెందిన బాలిక ఈనెల 16వ తేదీన పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం సిటీలోని ఓ ప్రైవైట్ ఆస్పత్రికి తరలించిగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం లావణ్య మృతి చెందింది. కోపోద్రీకులైన మృతురాలి కుటుంబ సభ్యులు బాలిక మృతదేహంతో నిందితుల ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ ముష్క రాజ్ ఘటనా స్థలానికి చేరుకొని సర్ధిచెప్పి వివాదాన్ని ముగించారు. తన కూతురు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి భూక్య మోహన్ రావు ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.