by Suryaa Desk | Thu, Sep 19, 2024, 03:23 PM
నాగార్జునసాగర్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ కానిస్టేబుల్ దుర్మరణం చెంది పరువురికి గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. సాగర్ సిఐ బీసన్న తెలిపిన వివరాల ప్రకారం గద్వాల జోగులాంబ జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ శ్రావణి (35) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది అన్నారు.
పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మొదట ఒక లారీకి చిన్న ప్రమాదము జరగటంతో లారీ డ్రైవర్ ఆ లారీని పక్కకు ఆపి మాట్లాడుతూ ఉండగా అంతలోనే సాగర్ నుంచి అతివేగంగా హైదరాబాద్ వైపు వెళుతున్న లారీ ఒక్కసారిగా హైదరాబాదు నుంచి సాగర్ వైపుకు నెమ్మదిగా వస్తున్న రెండు కార్లను బలంగా ఢీకొనడంతో ఒక కారులో ఉన్న మహిళ కానిస్టేబుల్ శ్రావణి అక్కడికక్కడే మృతి చెందిందని మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అన్నారు.మృతి చెందిన మహిళ జోగులాంబ ఆమె స్వస్థలం పెబ్బేరు అని తెలిపారు.
అయితే ఈమెకు ఇటీవలే నిశ్చితార్థం జరిగి, కొద్ది రోజులలో వివాహము జరగాల్సి ఉండగా తనకు కాబోయే భర్తతో కలసి నాగార్జునసాగర్ ను చూడటానికి వస్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో అనంత లోకాలకు వెళ్లిపోవడం చూపులను కంటతడి పెట్టించింది. ప్రమాదానికి గల కారణం అక్కడ ఆగి ఉన్న లారీనే అని అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని స్థానిక ఏరియా కమలా నెహ్రు ఆసుపత్రికి తరలించడం జరిగిందని, ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సి ఐ బీసన్న తెలిపారు