by Suryaa Desk | Wed, Sep 18, 2024, 10:24 AM
ఖమ్మం వరద బాధితుల కోసం విరాళాలు సేకరించడం జరుగుతుందని తెలంగాణ నిరుద్యోగ కళాకారుల బృందం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పిన్నింటి దాసు పేర్కొన్నారు. సిద్దిపేటలో సేకరించిన విరాళాలను త్వరలోనే ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయనున్నట్లు తెలిపారు. సిద్దిపేట పట్టణంలో ఖమ్మం వరద బాధితుల కోసం జిల్లా తెలంగాణ నిరుద్యోగ కళాకారుల బృందం సభ్యులు విరాళాలు సేకరించారు. వరద బాధ్యతలు కోసం తమ వంతుగా సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు.