by Suryaa Desk | Wed, Sep 18, 2024, 02:29 PM
ధరణిలో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే కలెక్టరేట్ కార్యాలయంలో అధికారికి ముడుపులు చెల్లించాల్సిందేనని బిఎస్పి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ఆరోపించారు. బుధవారం నారాయణపేట అంబేద్కర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ప్రధానంగా మరికల్, ధన్వాడ మండలాల్లో వసూళ్ల పర్వం కొనసాగుతోందని అన్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు లంచాలకు అలవాటు పడితే సామాన్యుల పరిస్థితి ఏంటని అన్నారు. అధికారులు విచారణ చేయాలన్నారు.