by Suryaa Desk | Thu, Sep 19, 2024, 04:30 PM
జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ శివారులోని సర్వేనెంబర్ 286లోని అసైన్ భూమిలో నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్న క్రషర్, క్వారీ పనులను నిలిపివేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కోరారు. బుధవారం ఆయన నివాసంలో ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.
రాళ్లకత్వ గ్రామ శివారులోని ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో నిబంధనలకు వ్యతిరేకంగా క్రషర్, క్వారీ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని, వీటికి ఆనుకొని మొండికుంట, నీటి కాలువ, రైతుల పొలాలు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి క్రషర్ క్వారీ పనులను వెంటనే నిలిపివేయించాలని కోరారు.