by Suryaa Desk | Thu, Sep 19, 2024, 04:44 PM
దేవరకొండ మండలం స్థానిక మైనారిటీ గురుకుల పాఠశాల లోమంగళవారం ముగ్గురు విద్యార్థుల అదృశ్యం అయ్యారుఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాఠశాలను సందర్శించి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తప్పిపోయిన విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చి తల్లితండ్రులకుఅప్పగించాలని ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గురుకుల పాఠశాలలు అద్వానంగామారుతున్నాయని.
కలుషిత ఆహారం తిని విద్యార్దులు ఇబ్బందులు పడుతున్నారు,ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితిగురుకులాల అధ్వాన్న పరిస్థితికి,విద్యార్థుల మరణాలకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రివి నువ్వే బాధ్యుడివి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మొద్దునిద్రను వీడి గురుకులాల్లో విద్య, భోజనం, వసతులు కల్పించేందుకు తక్షణంచర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.