by Suryaa Desk | Thu, Sep 19, 2024, 04:23 PM
మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో, ఏఐసీసీ అగ్రనేత, పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై, ఢిల్లీ బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే తన్విందర్ సింగ్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు, గూడూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ పై బీజేపీ నేత తన్విందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు. నువ్వు బయటకు వస్తే చంపేస్తామని, మీ నానమ్మ ఇందిరా గాంధీకి పట్టిన గతి నీకు పడుతుందని బహిరంగంగా తీవ్రమైన పదజాలంతో దూషించిన, మామూలు పౌరుడు విచక్షణ ను కోల్పోయి మాట్లాడిన తీరుగా, ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగించే తీవ్రవాదుల తీవ్రమైన పదజాలంతో, మాట్లాడిన తీరుకు, ఇప్పటివరకు బీజేపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదంటే?, పరోక్షంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా లు, తన్విందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను సమర్ధించినట్లేనని తేట తెల్లమవుతుంది.
దీనితో దేశ ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారో! అధికార బిజెపి పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎద్దేవ చేశారు. రాహుల్ గాంధీ పై, బీజేపీ నేతలు వరసగా చేస్తున్న తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న కూడా, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎందుకు కట్టడి చేయడం లేదని మండిపడ్డారు. మళ్ళీ ఇలాంటివి పునరావృతం అయితే! కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ రాష్ట్రం పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ లు ఏమి ఆదేశిస్తే, ఆదేశాల మేరకు మా కార్యాచరణ ఉంటాయని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి హెచ్చరించారు. వారితోపాటు గూడూరు మాజీ ఎంపీపీ. నూనావత్ రమేష్ నాయక్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నూనావతు రాధా, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎం డి. యాకుబ్ పాషా, జిల్లా నాయకులు మాధవ పెద్ది అమరేందర్ రెడ్డి, కనుమంతరెడ్డి రాజిరెడ్డి, మండల సీనియర్ నాయకులు కన్నబోయిన వెంకన్న, కోరే ఐలయ్య, చల్ల వెంకట్ రెడ్డి, పెసర శివ, దుబ్బ గూడెం రమేష్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చందు, శ్రీనివాస్, సోమన్న, హెచ్. శివ, గోపగాని యాదగిరి, వాంకోడోతు చందులాల్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.