by Suryaa Desk | Wed, Sep 18, 2024, 01:10 PM
మెట్ పల్లి మండల నూతన తహసీల్దార్ గా వచ్చిన శ్రీనివాస్ ను మండల కాంగ్రెస్ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్బంగా మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని సమస్యలు త్వరితగతిన పరిష్కరించెట్టు చూడాలని కోరారు.
సామాన్యులకు అందుబాటులో ఉంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశించిన ప్రజా పాలన సజావుగా సాగేట్లు చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎద్మల లక్ష్మారెడ్డి ట్రస్ట్ చైర్మన్ సంతోష్ రెడ్డి,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు పిడుగు తిరుపతిరెడ్డి, మాజీ కొండ స్వామి దేవస్థానం చైర్మన్ జెడి రవి, జీవన్, కొనరావుపేట గంగారెడ్డి, సతీష్, ప్రశాంత్,కిషోర్ రెడ్డి ,పుప్పాలగంగాధర్ తదితరులు పాల్గొన్నారు.