by Suryaa Desk | Thu, Sep 19, 2024, 03:37 PM
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్పై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దొంగలకు, రౌడీలకు, హంతకులకు ఇచ్చే ట్రీట్మెంట్నే ఆయనకు ఇవ్వాలన్నారు. మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన ఇలాంటి వ్యక్తిని సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలని టాలీవుడ్కు సూచించారు.తన వద్ద అసిస్టెంట్గా ఉన్న యువతిని మతం మార్చుకోమని చెప్పి జానీ మాస్టర్ హింసించారని ఆరోపించారు. మహిళల భద్రత కోసం బలమైన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. జానీ మాస్టర్ కేసులో అసలు విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందన్నారు.జానీ మాస్టర్ ఎంతమందిని ఇబ్బందులు పెట్టారు, ఎంతమంది పట్ల లవ్ జిహాద్ ప్రయోగించారో తెలియాల్సి ఉందన్నారు. సినిమా పరిశ్రమలో జానీ మాస్టర్ వంటి వారు చాలామంది ఉన్నారని మండిపడ్డారు. జానీ మాస్టర్ లాంటి వారి వల్ల సినీ పరిశ్రమకు చెడ్డపేరు వస్తుంది కాబట్టి అలాంటి వారిని పక్కన పెట్టాలని సూచించారు.కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను ఎస్వోటీ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. గోవా కోర్టులో హాజరుపరిచి, పీటీ వారెంట్పై హైదరాబాద్కు తరలిస్తున్నారు. జానీ మాస్టర్ను రేపు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు.