by Suryaa Desk | Wed, Sep 18, 2024, 02:40 PM
మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో, తెలంగాణ విమోచనదినం సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గుండబోయిన మల్లేష్ యాదవ్, జెండాను ఆవిష్కరించారు. తధానంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు, రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినాన్ని జరపాల్సిందేనని, ర్యాలీలు ధర్నాలు చేసి, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత,ఎంఐఎం పార్టీతో దోస్త్ని చేసుకొని , వారికి భయపడి విమోచన దినాన్ని తుంగలు తొక్కిన బి ఆర్ ఎస్ పార్టీ.
నేడు అదే తరహాలో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ విమోచన దినాన్ని, ప్రజా పాలన దినముగా పేరు మార్చి, జండా ఆవిష్కరణ చేయడంలో ఆంతర్యం ఏమిటని బిజెపి మండల అధ్యక్షుడు గుండెబోయిన మలేష్ యాదవ్ ఎద్దేవ చేశారు. ఈ ఇరు పార్టీలు దొందు దొందేనని, తెలంగాణ ప్రజానీకానికి ఈనాడు చెప్పకనే చెప్పాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మేరుగు మల్లయ్య గౌడ్, బత్తుల లక్ష్మణ్, గడిల రాజు, నల్లగొండ అనిల్, పుట్ట ఐలయ్య, బురగాని శ్రీరామ్, భీష్మ చారి, అడ్డూరి బ్రహ్మచారి, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.